BJP MLA Raja Singh : టెంట్ల క్రింద వందల మంది ఉన్నారు, ఆర్మీకి ధన్యవాదాలు | ABP Desam

2022-07-09 30

అమర్ నాధ్ యాత్రలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు పెను ప్రమాదం తప్పింది. రాజాసింగ్ కు అత్యంత సమీపంలో అకాల వరదల కారణంగా వందలాది మంది కొట్టుకుపోయారు. టెంట్లు కొట్టుకుపోయి భయంకర విధ్వంసం సంభవించింది. ఆర్మీ అప్రమత్తతతో ప్రాణనష్టం కాస్త తగ్గిందని, తాను సేఫ్ గా బయటపడ్డానని తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ శ్రీనగర్ నుండి వీడియో విడుదల చేశారు రాజాసింగ్.